నిర్మల్ జిల్లా సోన్ గ్రామంలో ప్రజలకు ట్రస్మా జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ నిత్యావసరాలను పంచిపెట్టారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇబ్బంది పడుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని తన సొంత గ్రామమైన సోన్ లో 800 మంది పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేసినట్లు ట్రస్మా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిఆర్ఎస్ యువ నాయకుడు లల్లోల గౌతమ్ రెడ్డి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సోన్ జెడ్ పి టి సి జీవన్ రెడ్డి, సొన్ సర్పంచ్ వినోద్ ఎంపిటిసిలు వనజా కృష్ణ ప్రసాద్ రెడ్డి, శ్రీనివాస్ మంజులాపూర్ పిఎసిఎస్ చైర్మన్ కృష్ణ ప్రసాద్ రెడ్డి ఈ జోన్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ దాసరి రాజేశ్వర్, వార్డ్ మెంబర్లు సోన్ ఎస్ ఐ రవీందర్ పాల్గొన్నారు.