కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలోని మైనంపల్లి ఫౌండేషన్ నిత్యావసరాలు పంపిణీ చేసింది. మల్కాజ్ గిరి పరిధిలోని బృందావన్ గార్డెన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ సీనియర్ నాయకడు వేణుగోపాలాచారి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
కార్పోరేటర్ జగదీశ్ గౌడ్ ,బద్దం బాల్ రెడ్డి తో పాటు తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు సుధాకర్ శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిత్యావసర వస్తువులను అందించిన దాతలకు బ్రాహ్మణులు ఆశీర్వాదం అందించారు. సుధాకర్ శర్మఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు ధన్యవాదాలు తెలిపారు.