39.2 C
Hyderabad
April 28, 2024 14: 26 PM
Slider ఆదిలాబాద్

కంటైన్ మెంట్ ఏరియా ప్రజలకు నిత్యావసరాలు

nirmal containment

నిర్మల్ పట్టణంలోని బుధవార్ పేట్ కంటైన్ మెంట్ ఏరియాలోని ప్రజలకు నిత్యావసర వస్తువులు అందచేశారు. కంటైన్ మెంట్ ఏరియాలో ఉన్న ప్రజలు అధైర్య పడాల్సిన అవసరం లేదని మున్సిపల్ D.E. సంతోష్, S.I.రాంనరసింహ రెడ్డి వారికి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం నడచుకుంటే కరోనా మహమ్మారి పరారవుతుందని వారు తెలిపారు.

కరోనా నియంత్రణకు ఇది తప్పని సరి అని, ప్రజల ఆరోగ్య రీత్యానే ప్రభుత్వం ఈ నిబంధన ఏర్పాటు చేసిందని వారు వివరించారు. ప్రజల సౌకర్యార్ధం కావలసిన నిత్యావసర వస్తువులు అందిస్తామని వారు తెలిపారు. కరోణ మహమ్మారి నియంత్రణకు  పాటించాల్సిన నియమాలను గురించి వివరిస్తూ జిల్లా  కలెక్టర్ ఆదేశాలను తూచ తప్పకుండా పాటించాలని వారు ప్రజలకు వివరించారు.

Related posts

విజయనగరం డీఎస్పీ కి ఏఎస్పీ గా పదోన్నతి

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కృష్ణకు ఘన నివాళి

Satyam NEWS

జగన్ ప్రభుత్వంపై మోదీ అసాధారణ ప్రేమ

Satyam NEWS

Leave a Comment