ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ గాంధీ చౌక్ లోని కృష్ణ ఆలయంలో నిర్మల్ కు చెందిన 50మంది నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర సరుకుల ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ దృష్ట్యా ఆలయాలు మూతపడడం తో ఉపాధి లేని బ్రాహ్మణులకు పురాణం సతీష్ సేవ చేయడం అభినందనీయమని మంత్రి అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రతీ సంవత్సరం బడ్జెట్ లో రూ.50 కోట్లు కేటాయిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, FSCS చైర్మన్ ధర్మజి రాజేందర్, లైబ్రరీ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్,TRS టౌన్ ప్రెసిడెంట్ మారుగొండ రాము, కౌన్సిలర్లు మేడారం అపర్ణ ప్రదీప్, ఎడిపెళ్లి నరేందర్, తదితరులు పాల్గొన్నారు.