ఎంతమంది కరోనా బాధితులు వచ్చినా చికిత్సకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారుల్ని ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణ, చికిత్సపై బుధవారం సీఎస్, డీజీపీ, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్ అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
విదేశాల నుంచి వచ్చినవారందరినీ క్వారంటైన్లో ఉంచే ఏర్పాట్లపై ఆయన చర్చించారు. అనంతరం ఈటల మాట్లాడుతూ క్వారెంటైన్లో అన్ని ఏర్పాటూ చేయాలన్నారు. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన వారిలో మాత్రమే వైరస్ ఉందన్నారు. విదేశీ విమానాలను పూర్తిగా రద్దు చేయాలని కేంద్రమంత్రిని కోరినట్టు చెప్పారు.