మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్పై పోటీ చేస్తానన్నారు. సీఎం కేసీఆర్ ఇలాగా అయిన గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ఈటల చెప్పారు. ఇందుకోసం గజ్వేల్లో సీరియస్గా వర్క్అవుట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈటల పేర్కొన్నారు. పశ్చిమ బంగాలో సువేందు అధికారి దృశ్యం.. తెలంగాణలో పునరావృతం అవుతుందని తెలిపారు. బంగాల్లో మాదిరిగానే ముఖ్యమంత్రిని ఇక్కడ ఓడించాలని వ్యాఖ్యానించారు.