తెలుగుదేశం పార్టీ నాయకుల అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది.
తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడులు చేసిన వారిని కాకుండా ఆ దాడికి నిరసన తెలిపేవారిని అరెస్టు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్లే పోలీసులు చేస్తున్నారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్రను తాజాగా అరెస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభి పై దాడికి నిరసనగా సీఎం ఇల్లు ముట్టడికి టీడీపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమంలో పాల్గొంటారని భావించిన కొల్లు రవీంద్రను ముందస్తు జాగ్రతగా పోలీసులు అరెస్ట్ చేశారు. కొల్లు రవీంద్ర ని అరెస్ట్ చేసి నున్న పోలీస్ స్టేషన్ కు తరలించారు.