నెల్లూరు స్టోన్హౌస్ పేటలోని శ్రీ వాసవి మాత కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్చార్జి పొంగూరు నారాయణ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పదో డివిజన్లోని కోదండరామపురం శ్రీ మహాలక్ష్మి ఆలయం, అదే విధంగా బాబుగిరిజన కాలనీలోని శ్రీ మహాలక్ష్మి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా టీడీపీ శ్రేణులు ఆయనకి స్వాగతం పలికారు. అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. అమ్మవారి ఆశీస్సులు, దీవెనలతో రాష్ట్రం, ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. న్యాయ స్థానాల మీద నమ్మకం ఉందని…త్వరలోనే నిజాయితీగా చంద్రబాబు బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాళ్లపాక రమేష్రెడ్డి, ఆరో డివిజన్ నాయకులు ప్రవీణ్ లు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
previous post