రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు ఆయన సోదరి మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ సతీమణి శైలిమ తో బాటు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తదితరుల కూడా పాల్గొన్నారు.
అనంతరం టీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు కూడా కేటీఆర్ కు రాఖీ కట్టారు. కేటీఆర్ కు రాఖీ కట్టిన వారిలో మంత్రి సత్యవతి రాథోడ్ ఎంపి కవిత తదితరులు కూడా ఉన్నారు. అదే విధంగా హైదరాబాద్ లో కొండాపూర్ తన నివాసంలో మంత్రి హరీష్ రావుకు టీఆర్ఎస్ మహిళా నాయకులు రాఖీ కట్టారు.