రాష్ట్రంలో అస్సలు పరిపాలన కొనసాగుతుందా అని తెలుగు దేశం పార్టీ ప్రశ్నించింది. విజయనగరం జిల్లా లో కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు బంగ్లాలో ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి, కళా వెంకటరావు, ఐవీపీ రాజు ఇతర నేతలంతా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కళా వెంకటరావు మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలలో జగన్ ఫోటో తప్ప..అసలు రైతు కు సంబంధించి ఏ ఒక్క ఫోటో గా ని కార్యక్రమం గాని ఉండటం లేదన్నారు. పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.ఉత్తరాంధ్ర లో ఏ ఒక్క ప్రాజెక్టు గాని పథకం కానీ జగన్ ప్రారంభించలేదన్నారు.ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నేతలంతా పాల్గొన్నారు.