కట్టా వారి సేవా కేంద్రం, మ్యాక్సీవిజన్ కంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, క్లవ్ డెంటల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ KPHB కాలనీ మూడవ ఫేజ్ లోని రమ్య గ్రౌండ్ ఎదురుగా ఉచిత దంత, కంటి చికిత్సా శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరంలో మొత్తం 31 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కట్టా వారి సేవా కేంద్రం నిర్వాహకులు కట్టా నరసింగరావు మాట్లాడుతూ కాలనీ ప్రజలు ఈ కార్యక్రమానికి బాగా స్పందించినట్లు తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను ప్రజలు విరివిగా ఉపయోగించుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమములో మ్యాక్సీవిజన్ కంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది ఆప్తమెట్రిస్ట్ యోగేష్, కౌన్సిలర్ నవీన్ కుమార్, టెక్నీషియన్ సంతోష్ సింఘ్, క్లవ్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ నవీన్, మేనేజర్ మల్లికార్జున, కాలనీవాసులు కాముని నరసింహారెడ్డి, పిడికిటి గోపాల్ చౌదరి, జనగామ సురేష్ రెడ్డి, రాచకొండ భాస్కర్, వాసిరెడ్డి లక్ష్మీనారాయణ, గిద్దలూరు రాముడు తదితరులు పాల్గొన్నారు.