33.7 C
Hyderabad
April 29, 2024 02: 40 AM
Slider గుంటూరు

గ్రామీణ రోడ్లకు నిధులు మంజూరు చేయండి

#gopireddy

గ్రామ పంచాయితీలకు సంబంధించిన రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని కోరారు. గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి, గుంటూరు జిల్లా ఇంచార్జి మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు నేడు నరసరావుపేట వచ్చారు.

ఇద్దరు మంత్రులతో బాటు రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామి రెడ్డి,  వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ రావు, సత్తెనపల్లి శాసనసభ్యులు అంబటి రాంబాబు, జీడీ సి సి చైర్మన్ రాతంశెట్టి సీతారామంజనేయులు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు తదితరులు కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసాన్ని వారు సందర్శించారు. నరసరావుపేట నియోజకవర్గ అభివృద్ధి గురించి మంత్రులు అడిగి తెలుసుకున్నారు. మంత్రి కి అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి విపులంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి విశదీకరించారు.

Related posts

పప్పు దినుసులకు అధిక ధర చెల్లించ వద్దు

Satyam NEWS

బిచ్కుందలో శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం

Satyam NEWS

ఈటలకు బ్రహ్మరథం పట్టిన హుజురాబాద్ ప్రజలు

Satyam NEWS

Leave a Comment