ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు ఈజిప్ట్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 2023 రిపబ్లిక్ డే నాడు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసి విదేశీ అతిథిగా హాజరవుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సంవత్సరం రెండు దేశాలు దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాయి. గత నెలలో, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈజిప్టు పర్యటనలో ప్రెసిడెంట్ ఎల్-సిసిని కలిశారు. 2021లో అప్పటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ను రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథిగా పిలిచారు. అయితే, అప్పుడు కరోనా మహమ్మారి కారణంగా బ్రిటన్ ప్రధాని రాలేకపోయారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా, వరుసగా రెండేళ్లుగా రిపబ్లిక్ డేకి ఏ విదేశీ నాయకుడూ ముఖ్య అతిథిగా రాలేదు.
previous post