హైదరాబాద్ పరిధిలో నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న 13 మంది ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కమిషనరేట్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల్లో నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేస్తున్న 13 మంది సభ్యులను అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులు నకిలీ కరెన్సీ రాకెట్లు పట్టుకొని వారి వద్ద నుండి 30 లక్షల 68 వేల ఐదు వందలు నగదు 13 మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాలలో కూడా చలామణి చేస్తున్నట్లు గుర్తించి సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
previous post