డిఎస్పి గా అవతారమెత్తి అనేకమందిని మోసం చేస్తున్న శ్రీను అనే వ్యక్తి రాజమండ్రి టూటౌన్ పోలీసులకు చిక్కాడు. తాను పోలీసు అధికారి నంటూ మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న శ్రీను నుండి పోలీసులు రూ.10.9 లక్షలు, 3 జతల నకిలీ యూనిఫామ్స్, ఫేక్ లెటర్ హెడ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చాలా మందికి టోకరా వేశాడు. నిందితుడు నల్గొండ జిల్లా మట్టపల్లి వాసిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
previous post