29.7 C
Hyderabad
April 29, 2024 10: 35 AM
Slider చిత్తూరు

హానర్: దొరస్వామి రెడ్డికి ఆత్మీయ సత్కారం

naveen reddy

28 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి ఎందరికో విద్యాదానం చేసిన ముద్ధిరెడ్డిగారి దొరస్వామి రెడ్డి పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు తిరుపతిలో ఆత్మీయ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిధిగా హాజరైన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆయనకు ఆత్మీయ సన్మానం చేశారు. ఉపాధ్యాయులుగా, ప్రధానోపాధ్యాయులుగా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి పదవీ విరమణ చేసిన దొరస్వామి రెడ్డి ఎందరికో ఆదర్శనీయుడని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయనకు ఆత్మీయ సత్కారం చేయడం గర్వకారణమని అన్నారు. నవీన్ కుమార్ రెడ్డి తో బాటు గుండాల గోపీనాథ్ రెడ్డి, అక్కినపల్లి మునికృష్ణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

మొబైల్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రానికి విశేష స్పందన

Satyam NEWS

కామారెడ్డి బరిలో 74 మంది అభ్యర్థులు

Satyam NEWS

నాటి మంత్రుల శిలాఫలకాలు..నేటి మంత్రుల ప్రారంభోత్సవాలు…

Satyam NEWS

Leave a Comment