విజయనగరం జిల్లాలో ఎన్.సి.ఎస్ చెక్కర కర్మాగారానికి కి సంబంధించిన రైతుల బకాయిలను రెవిన్యూ రికవరీ చట్టం ప్రకారంగా చెల్లించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఆదేశించారు. ఈ మేరకు తన ఛాంబర్ లో సంయుక్త కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ , సబ్ కలెక్టర్ భావన తో కలసి బకాయిల చెల్లింపుల పై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2019-20, 2020-21 రెండు సీజన్ల క్రషింగ్ కు సంబంధించి 16కోట్ల 33 లక్షల రూపాయలను, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డ్యూటీ బకాయిలు 87.50 లక్షలు, ఈ.పి.ఎఫ్ బకాయిలు 3 కోట్ల 41 లక్షలు, జి.ఎస్.టి బకాయిలు 3.36 కోట్ల రూపాయలను ఆర్ ఆర్ ఆక్ట్ ని అమలు చేస్తూ మొత్తం 23.98 కోట్ల బకాయిలను చెల్లించాలని అన్నారు.
ఆ మేరకు ఇద్దరు తాసిల్దార్లకు ఆదేశాలు జారి చేసారు. ఈ బకాయిలను తీర్చడానికి గాను బొబ్బిలి లో 14 ఎకరాల 67 సెంట్లు, సీతానగరం లో 5 ఎకరాల 23 సెంట్లు ఆస్తుల జప్తుకు నోటీసు లు జారి చేసి వేలం వేయాలని సూచించారు. అందుకు అవసరమగు నిబంధనలన్నిటిని పాటిస్తూ బకాయిల చెల్లిం పూలకు అవసరమగు చర్యలను వెంటనే చేపట్టాలన్నారు. ఈ సమావేశం లో సీతానగరం, బొబ్బిలి తహసిల్దార్లు అప్పల రాజు, రామ స్వామి , బొబ్బిలి చెక్కర కర్మాగారం సహాయ కమీషనర్ లోకేస్వర రావు, కలెక్టరేట్ పరి పాలనా అధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.