అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని పలు గ్రామాల్లో మంగళవారం ఈదురుగాలులతో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. మండలంలోని మార్చాలా కురుమిద్ద జీడిపల్లి వెంకటాపూర్ వివిధ గ్రామాల్లో కురిసిన వర్షానికి వరి మామిడి తదితర పంటలు దెబ్బతిని రైతులు కుదేలవుతున్నారు.అకాల వర్షాల వల్ల ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో రైతు అప్పుల బాధలతో చావే శరణ్యం అన్నట్టుగా ఉంది.కల్వకుర్తి పట్టణ పరిధిలో పడకుండా కక్ష కట్టినట్టు వ్యవసాయ పొలాలలో పల్లెటూర్లలో వర్ష ప్రభావం ఎక్కువ ఉండడం జీర్ణించుకోలేని విషయంగా ప్రస్తుత పరిస్థితులు గోచరిస్తున్నాయి.
previous post