రాహుల్ గాంధీపై అనర్హత వేటు కేంద్ర ప్రభుత్వ దుశ్చర్యకు పరాకాష్ట అని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. అక్రమాలను ప్రశ్నిస్తారనే భయంతోనే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారన్నారు. కేంద్రం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు తిలోదాకాలిచ్చిందన్నారు. భారత దేశ చరిత్రలో నేడు చీకటి రోజు గా నామ అభివర్ణించారు. బీజేపీ దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులంతా తీవ్రంగా ఖండించాలని నామ నాగేశ్వరరావు కోరారు. దర్యాప్తు సంస్థల అండతో ప్రతి పక్షాల గొంతు నొక్కుతున్నారని నామ అన్నారు.పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ చేసే విదంగా కేంద్రం చర్యలున్నాయని తెలిపారు. బీజేపీ దుర్మార్గాలను ప్రజలు గమనిస్తున్నారని, దేశ ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి తప్పక తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్య దురదృష్టకరమని నామ పేర్కొన్నారు.
previous post