31.7 C
Hyderabad
May 2, 2024 10: 17 AM
Slider నల్గొండ

జర్నలిస్ట్ కోలా నాగేశ్వరరావు కు సన్మానం

#journalist

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రముఖ జర్నలిస్టు కోలా నాగేశ్వరరావు ను హుజూర్ నగర్ ఎంపిపి గూడెపు శ్రీనివాస్ సత్కరించి సన్మానించారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని తెలంగాణ భవన్ లో డిసెంబర్ 22న,   సాహితీ రత్న బెస్ట్ జర్నలిస్టు అవార్డు సాధించిన హుజూర్‌నగర్ ఆంధ్రజ్యోతి విలేఖరి కోలా నాగేశ్వరరావును  పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి గూడెపు శ్రీనివాస్ ఘనంగా సన్మానించడం జరిగింది.

ఈ సందర్బంగా గూడెపు శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో ప్రజలకు ఉపయోగపడే వార్తలు రాసే వ్యక్తులకు ఎప్పుడూ గుర్తింపు లభిస్తుందని అన్నారు.జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు.కోల నాగేశ్వరరావు జాతీయ స్థాయిలో సాహితి  రత్న అవార్డు పొందడం ఎంతో అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

కోవిడ్ 19 రోగులలో ముకోర్మైకోసిస్(బ్లాక్ ఫంగస్)కు హోమియో చికిత్స

Satyam NEWS

జీవో కేవలం క్రిమినల్ చర్యలకు ఉద్దేశించింది కాదు

Satyam NEWS

యాసంగి వ‌రి ధాన్యం కొనుగోలు చేయాల్సిందే

Sub Editor 2

Leave a Comment