తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రముఖ రంగస్థలం సినీ,టీవీ కళాకారుడు డాక్టర్ గుంటి పిచ్చయ్య కళా రంగంలో జానపద,సాంఘిక,చారిత్రాత్మక,పౌరాణిక నాటక,నాటిక,ఏకపాత్రాభినయాల్లో ప్రావీణ్య పొందుతూ పలు ప్రాంతాలలో వివిధ ప్రదర్శనలు ఇచ్చిన డాక్టర్ గుంటి పిచ్చయ్యకు,ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ సాంస్కృతి కార్యక్రమాలతో విద్యార్థిని విద్యార్థులను సాంస్కృతిక రంగంలో తీర్చిదిద్దిన ప్రముఖ సాహితీవేత్త సోమయాజుల భవానికి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా నరసింహ పురం గ్రామంలో ఎస్.వి.కళాశాల కరస్పాండెంట్,ఫౌండర్ సైదులు,సామాజికవేత్త వేపూరి సత్యనారాయణ,గ్రామ పెద్దలు భవానీ,గుంటి పిచ్చయ్య ను ఘనంగా సన్మానించి,షీల్డ్,పుష్ప కిరీటాలతో ఘనంగా సత్కరించారు.
వజ్రోత్సవాల్లో హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి గ్రామానికి చెందిన ఇరువురికి సదవకాశం రావడం అభినందనీయమని,నాటక సమాచార సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్ అన్నారు.ఈ అవార్డు రావడం పట్ల తోటి ఉద్యోగులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్