వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ సన్నాహక కమిటీ సభ్యుడిగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇంచార్జ్ గా ఆదెర్ల శ్రీనివాస్ రెడ్డిని ఎన్నుకున్న శుభ సందర్భంగా మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామ వైఎస్ఆర్ పార్టీ యువత ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డిని పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ మఠంపల్లి మండల యువజన విభాగం సభ్యుడు బలుసుపాటి రవి మాట్లాడుతూ శ్రీనివాస రెడ్డి పై ఎంతో నమ్మకం ఉంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఉమ్మడి నల్లగొండ జిల్లా YSRTP సన్నాహక కమిటీ సభ్యుడిగా ఎంపిక చేసినందుకు షర్మిల లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.శ్రీనివాస్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని పదవులను అలంకరించాలని కోరారు.
అనంతరం ఆదెర్ల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకు, రాజన్న సంక్షేమ పాలన అందించే లక్ష్యంతో శ్రీమతి వైయస్ షర్మిల చూపిన బాటలో నడుస్తానని,ఈ ప్రాంత యువతీ, యువకులతో పాటుగా నమ్మి వచ్చిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని అన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బలోపేతానికి తన వంతు శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో తుమ్మేపల్లి ప్రసాద్, రవీందర్,హరీష్,మహేష్,నవీన్,గోపి, వీరబాబు,రవి,ఉపేందర్,నాగరాజు, రామారావు,కృష్ణ YSR అభిమానులు తదితరులు పాల్గొన్నారు.