బిచ్కుంద మండలంలో ఆరవ విడత హరితహార కార్యక్రమం పండుగలా ప్రారంభమైంది. మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఎంపిపి అశోక్ పటేల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో ఆయా గ్రామాలలో సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
బిచ్కుంద పోలీస్ ఠాణాలో సిఐ సాజీద్ ఎస్సై సాయన్నలు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపిపితో పాటు ఎంపిడిఓ ఆనంద్, తహశీల్దార్ వెంకట్రావు, వ్యవసాయ అధికారి పోచయ్య, బిచ్కుంద పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి, మండల పరిషత్ అధికారి మహ్బూబ్ ఆయా గ్రామాల్లో సర్పంచ్లు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడీ కార్యకర్తలు హరితహరంలో పాల్గొన్నారు.