కొల్లాపూర్ పట్టణంలోని గ్రీన్ ల్యాండ్ హైస్కూల్ విద్యార్ధుల ఫీల్డ్ ట్రిప్ ఒక ప్రత్యేక పద్ధతిలో జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టును పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్ధులకు చూపించింది. దీని కోసం ఎల్లూర్ కు విద్యార్ధులను తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ శంకర్ మాట్లాడుతూ విద్యార్ధులకు చిన్నతనం నుంచే నీటి శుభ్రత గురించి చెప్పాల్సిన అవసరాన్ని గుర్తించి ఈ ఫీల్డ్ ట్రిప్ ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్ధులకు తరగతి గదికి సబంధించిన విషయాలే కాకుండా నీటి శుద్ధి ప్రక్రియ ఎలా జరుగుతుందో క్షేత్ర పర్యటనలో విద్యార్ధులకు ప్రత్యక్షంగా చూపించామని ఆయన అన్నారు. దీని వల్ల ఈ విషయం ఆ విద్యార్ధులకు చాలా కాలం గుర్తుంటుందని ఆయన తెలిపారు.
విద్యార్ధులు అక్షయ, ఆదిత్య, గోవర్ధన్ లు నీటి శుద్ధి కార్యక్రమాన్ని ఎలా చేపడతారో ప్రత్యక్షంగా చూడటం ఎంతో ఆశక్తి కలిగిస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం వెంకటేశ్, నరేష్, కుమారస్వామి, ప్రిన్సిపల్ శంకర్ టీచర్లు అనిల్, సువర్ణ, సంగీత, శాంతి తదితరులు పాల్గొన్నారు.