నగరంలోని 30 సర్కిల్ కార్యాలయాలు, రెవిన్యూ కార్యాలయాలు, వార్డు కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రకటించిన సంబంధిత డిప్యూటీ కమీషనర్లు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ వెబ్ సైట్ లోనూ తుది ఓటర్ల జాబితాను పొందుపర్చారు.
ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలో తమ పేర్లను చెక్ చేసుకొని తమ పేర్లు లేకుంటే ఫారం 6 ద్వారా సంబంధిత అసెంబ్లీ ఎలక్టోరల్ అధికారి వద్ద ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేంత వరకు ధరకాస్తు చేసుకోవచ్చన్నారు.
గ్రేటర్ లోని 150 వార్డులకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు.
ఈ పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను సంబంధిత సర్కిల్ కార్యాలయాలు, వార్డ్, ఆర్.డీ.ఓ, తహశీల్ కార్యాలయాలలో ప్రకటించాలన్నారు.
పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలను ఈ నెల 17 తేదీలోగా సమర్పించాలి. ఈ క్లెయిమ్ లను పరిశీలించిన అనంతరం 21 ఈ నెల సంబంధిత రిటర్నింగ్ అధికారులు తుది పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటిస్తారు.
ఎన్నికల అధికారి, జీహెచ్ ఎంసీ కమీషనర్