ఆంధ్రప్రదేశ్ లో కరోనా టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది.
విజయవాడ జీజీహెచ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పాల్గొని టీకా పంపిణీని ప్రారంభించారు.
తొలి టీకా జీజీహెచ్ పారిశుద్ధ్య విభాగం మహిళా ఉద్యోగి బి.పుష్పకుమారికి ఇచ్చారు. రాష్ట్రానికి 4.96 లక్షల డోసుల టీకా వచ్చింది.
ఇందులో 20వేల డోసులు కొవాగ్జిన్ (భారత్ బయోటెక్), మిగిలినవి కొవిషీల్డ్ (సీరం) టీకా. తొలివిడతలో కొవిషీల్డ్నే లబ్ధిదారులకు వేయనున్నారు.