38.2 C
Hyderabad
April 29, 2024 12: 25 PM
Slider ప్రత్యేకం

మంత్రి పేర్ని నానికి ఘాటుగా సమాధానం ఇచ్చిన వంగవీటి రాధ

#vangaveetiradha

కాపు కులాన్ని దారుణంగా తిట్టిన మంత్రి పేర్ని నానిపై వంగవీటి రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంజిల్లా ఎర్రుబాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో వంగవీటి  మోహనరంగా విగ్రహాన్ని నేడు ఆయన ఆవిష్కరించారు. తన తండ్రి రంగాను అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని, తరాలు మారినా, యుగాలు మారినా ధరిత్రి ఉన్నంత వరకు రంగా ఉంటారని ఆయన అన్నారు.

రంగా కాపులకు ఆరాధ్యదైవమైతే… అన్ని వర్గాల పేదలకు గుండె చప్పుడు లాంటి వారని రాధాకృష్ణ అన్నారు. మన నాయకుడు రంగాని మనం కాపాడుకోలేక పోయాం…. ఇప్పుడు అయినా ఆవేశం తగ్గించి ఆలోచనతో ప్రస్తుతం ఉన్న నాయకులను అయినా కాపాడుకోమని కోరుతున్నా అని ఆయన ఆవేదనాభరితంగా అన్నారు. పుట్టిన కులాన్ని తిట్టడం  ప్రతి అడ్డమైనోడికి ఫ్యాషన్ అయిపోయింది అంటూ ఆయన పరోక్షంగా మంత్రి పేర్ని నానిని విమర్శించారు.

వాళ్లేదో గొప్పగా భావిస్తూ… పుట్టిన కులాన్ని వెటకారం చేస్తున్నారు…ఈ కులం వారంతా ఐక్యంగా ఉంటే ప్రభుత్వాలనే పడగొట్టే సత్తా ఉంది… ఐకమత్యమే బలం.. ఉన్నవారిని అయినా కాపాడుకోండి అని ఆయన అన్నారు.

Related posts

కరోనా వ్యాక్సిన్ పై తప్పుడు సమాచారం

Satyam NEWS

బాసర అమ్మవారి సేవలో ముస్లిం భక్తులు…..

Satyam NEWS

హీనియస్ క్రైమ్: పంజాగుట్టలో మైనర్ బాలికపై అత్యాచారం

Satyam NEWS

Leave a Comment