లాక్ డౌన్ నేపథ్యంలో రోజూవారీ ఆహారానికి నోచుకోని పేదలను ఆదుకోవాలని హైదరాబాద్ లోని ఖైరాతాబాద్ కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు చందు నిర్ణయించారు. ఈ మేరకు ఆయన ఖైరతాబాద్ ప్రాంతంలో నిరుపేదలకు పెద్ద ఎత్తున ఆహార పదార్ధాలు సరఫరా చేసి ఆదర్శంగా నిలిచారు.
దాదాపు 300 మందికి ఆయన ఆహార పదార్ధాలు సరఫరా చేసినట్లు చెప్పారు. లాక్ డౌన్ నేపథ్యంలో రోజువారీ సంపాదన లేక ఎంతో మంది ఆకలితో ఉంటున్నారు. వారిని ఈ విధంగా ఆదుకోవడం తన బాధ్యతగా భావించినట్లు చందు తెలిపారు.