వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఫారెస్ట్ కార్యాలయం అధికారి దివాకర్ పై మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత వరదరాజుల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రొద్దుటూరులో ఫారెస్ట్ అధికారుల పనితీరు చాలా దారుణంగా ఉందని, లంచం లేనిది ఏ ఒక్క పని కూడా ఫారెస్ట్ అధికారులు చేయడం లేదని వరదరాజులు రెడ్డి సబ్ డివిజనల్ అధికారిపై మండిపడ్డారు.
కోత మిషన్ల యొక్క అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకునీ నెలలు గడుస్తున్న వాటిని అధికారులు పట్టించుకోవడంలేదని, లక్షల రూపాయలు డబ్బు లంచంగా డిమాండ్ చేస్తున్నారంటూ అటవీ శాఖ అధికారులపై వరదరాజుల రెడ్డి విమర్శించారు.
ఫారెస్ట్ భూములు ఆక్రమించుకుంటున్న, నిర్మాణాలు చేపడుతున్న లక్షల రూపాయలు డబ్బు తీసుకొని చూసి చూడనట్లు ఫారెస్ట్ అధికారులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. అవినీతి అధికారులపై చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నారని వరద రాజుల రెడ్డి తెలిపారు.