కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఉసురు తీస్తున్నాయని జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి దేవర మల్లీశ్వరి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఢిల్లీలో రైతులు చేస్తున్నదీక్షకు మద్దతుగా ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి అనంతరం ఉద్యమంలో చనిపోయిన రైతులకు కొవ్వొత్తుల వెలుగులతో నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మల్లేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల దేశ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా రూపొందించిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు ఉద్యమాన్నినీరుగార్చే ప్రయత్నాలు ఫలించవన్నారు. రైతుల శ్రేయస్సు కోరే ప్రభుత్వమైతే నిజమైతే వెంటనే రైతుల డిమాండ్లను అంగీకరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా గౌరవ అధ్యక్షురాలు పశ్య పిచ్చమ్మ, పట్టణ అధ్యక్ష్య, కార్యదర్శులు దేవరం సుజాత, యల్లావుల ఉమా, మహిళా నాయకురాళ్లు దేవరం అరుణ, పశ్య లక్ష్మి, పులిచింతల వెంకట్రావమ్మ, పులిచింతల వీణా, ఎస్.కె .ఆశా, చెన్నగానీ లక్ష్మీ, దేవరం నాగమణి, చెన్నగాని రామనర్సమ్మ, చెన్నగానీ రాములమ్మ, దేవరం అరుణ, నాయకులు దేవరం రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.