ఉప్పల్ ఎలక్ట్రానిక్ మీడియా క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు . ఉప్పల్ బస్ డిపో వద్ద మీడియా క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియా క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పయ్యావుల సంతోష్ మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సంక్షేమం, అభివృద్ధి కోసం అందరినీ కలుపుకుని కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా క్లబ్ గౌరవ సలహాదారుగా పెంబల్ల కుమార్ యాదవ్ ( 6tv) , అధ్యక్షుడిగా పయ్యావుల సంతోష్ ( ఐన్యూస్) , వర్కింగ్ ప్రెసిడెంట్ గా మెట్టు రవీందర్ రెడ్డి ( సాక్షి టివి ) , ప్రధాన కార్యదర్శిగా తుంపిళ్ల సతీష్ ( హెచ్ఎంటివి ), కోశాధికారిగా కొయ్యేడి కరుణాకర్ ( రాజ్ న్యూస్ ) ఉపాధ్యక్షులుగా గోరుకంటి నరేందర్ (10 టివి) , చెన్న రూపేష్ ( మహన్యూస్ ) , నారోజు రమేష్ ( స్టూడియో ఎన్ ) , జాయింట్ సెక్రటరీ లుగా ఏర్పుల కుమార్ ( మా తెలంగాణ ) దొంతు స్టాలిన్ ( బిసిఎన్ న్యూస్ ) , ఆర్గనైజింగ్ సెక్రటరీ లుగా సీఎం . చంద్రశేఖర్ ( వీ5 న్యూస్ ) , కోతి మహేష్ ( స్టూడియో 18 ) కో – ఆర్డినేటర్ గా గోరంట్ల సోనిశ్రీ ( వీ3 న్యూస్ ) ఈసి మెంబర్లుగా ఇందూరి విశ్వనాథ్ , నల్లమాస మనోజ్ కుమార్ , కూరెళ్ల అరుణ్ కుమార్ , రాంపల్లి రమేష్ , బరిగెల భానుప్రసాద్ , జగిని మధు లను ఎన్నుకున్నట్లు తెలిపారు .