రాజమణి దేవి చారిటబుల్ ట్రస్టు, అనువంశిక అర్చక సమాఖ్య, వేములవాడ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కరోనా వైరస్ నివారణ కు రేపు ఉచితంగా హోమియో మందు పంపిణీ చేయడానికి నిర్ణయించారు. వేములవాడ నియోజకవర్గ ఎం. ఎల్. ఏ రమేష్ బాబు చెన్నామనేని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
వేములవాడ మార్కెట్ రోడ్డు లోని జవహార్ లాల్ నెహ్రూ విద్యాసంస్థల ప్రాంగణంలో ఈ కార్యక్రమం ఉంటుంది. గురువారం ఉదయం 9.30కు ఈ కార్యక్రమం ప్రారంభమౌతుందని నిర్వాహకులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యగా హోమియో మందు వాడటం మంచిదని అందువల్ల అందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు. దాదాపు రెండు వేల మందికి చేరాలన్న ఉద్దేశ్యంతో అన్ని డోసుల మందు తెప్పించామని వారు వెల్లడించారు.