ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరం దుర్గమ్మ కాలనిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దెందులూరు ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్య చౌదరిని లింగపాలెం మండలం బాధరాల మాజీ సర్పంచ్ తాతా కోటేశ్వరరావు, వై సి పి నాయకులు బొల్లినేని సుబ్బారావు తదితరులు ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 25 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని రామసింగవరం నుండి బాధరాల గ్రామ పొలిమేర వరకు గల ఆర్ అండ్ బి రహదారిని అభివృద్ధి చేసిన ఘనత చరిత్ర సొంతం చేసుకున్నారని కొనియాడారు. 25 ఏళ్ళు గా ఎందరో నాయకులను కలిసినా రహదారికి నిధులు మంజూరు చేయించ లేక చేతులెత్తేసారని అప్పటి నుండి నేటి వరకు తమ బాధలు ఎవరికి చెప్పుకున్నా తీరలేదని బాధరాల మాజీ సర్పంచ్ కోటేశ్వరరావు ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరికి వివరించారు. మీలాంటి దమ్ము ధైర్యమున్న మీ నాయకత్వం మాకు కావాలి బాబూ మళ్ళీ మళ్ళీ ఎం ఎల్ ఏ గా మీరే రావాలి సార్ మీరే కావాలి సార్ అంటూ ఎం ఎల్ ఏ తో బాటు గడప గడపకు కార్యక్రమం లో పాల్గొన్నారు.
previous post