సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి కరోనా రోగులతో నిండిపోయింది. ఇప్పటికే 450కి పైగా పేషెంట్స్ ఉన్నారు. నిన్న ఒక్కరోజే 150 మంది అడ్మిట్ అయ్యారు.
ప్రతి 10 నిమిషాలకు ఒక కరోనా పేషెంట్ అడ్మిట్ అవుతున్నారు. IP బ్లాక్ మొత్తం ఇప్పటికే కోవిడ్ పేషెంట్స్ తో నిండిపోయింది.
దాంతో గాంధీ ఆస్పత్రి ని రేపటి నుంచి పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మార్చేందుకు ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.
రేపటి నుంచి ఎమర్జెన్సీ సర్వీస్ లు కూడా ఆపేసి… కేవలం కోవిడ్ రోగులను మాత్రమే గాంధీ హాస్పిటల్ లో చేర్చుకుంటారు.
శనివారం నుంచి OP ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎలెక్టీవ్స్ కూడా ఆపేసి కేవలం కోవిడ్ కేసులు మాత్రమే ట్రీట్మెంట్ చేయాలని నిర్ణయించారు.