29.7 C
Hyderabad
April 29, 2024 10: 14 AM
Slider హైదరాబాద్

గణనాధుని పూజలో కార్పొరేటర్  రాగం నాగేందర్ యాదవ్

#arekepudigandhi

శేరిలింగంపల్లి లోగల బ్రిక్స్ స్కై వుడ్ అపార్ట్మెంట్స్ లో ఏర్పాటు చేసిన గణనాధుని మండపంలో స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ తో కలిసి పాల్గొని కార్పొరేటర్  రాగం నాగేందర్ యాదవ్ పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం డివిజన్ లో గల రైల్ విహార్, సురభి కాలనీ, పాపిరెడ్డి కాలనీ, ఆరంభ టౌన్షిప్, వివిధ కాలనీలలో వినాయక చవితిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన గణనాధుని మండపాల్లో గణేష్ భగవాన్ కు ప్రత్యేకంగా పూజలు చేశారు. పూజల అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేసి, రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాధుని కోరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హైదరాబాద్

Related posts

ములుగులో STU TS సభ్యత్వ నమోదు కార్యక్రమం

Satyam NEWS

మృతుని కుటుంబానికి మాజీ మంత్రి జూపల్లి భరోసా

Satyam NEWS

మంగళగిరి అసెంబ్లీ స్థానంలో భగ్గుమన్న విభేదాలు

Satyam NEWS

Leave a Comment