తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 28వ తేదీన పౌర్ణమి గరుడసేవను టిటిడి రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.
శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరుగుతున్న కారణంగా పౌర్ణమి గరుడసేవ రద్దయింది. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.
తుంబురు తీర్థానికి భక్తులకు అనుమతి లేదు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 నిబంధనల మేరకు తిరుమలలో మార్చి 28వ తేదీన తుంబురు తీర్థ ముక్కోటికి భక్తులకు అనుమతి లేదని టిటిడి తెలిపింది. ఈ పర్వదినం నాడు ఎక్కువ మంది భక్తులు విచ్చేసి ఈ తీర్థంలో స్నానాలు చేసే సంప్రదాయం ఉన్నందువల్ల, భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు టిటిడి స్పష్టం చేసింది.