28.7 C
Hyderabad
April 28, 2024 10: 20 AM
Slider గుంటూరు

జనసేన సభ్యత్వం ఉంటే రూ.5లక్షల భీమా ఉన్నట్లే

#janasena

పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో జనసేన సభ్యత్వం నమోదు చురుకుగా సాగుతోంది. బొర్రా అప్పారావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ సభ్యత్వాలు నమోదు అవుతున్నాయి. జనసేన సభ్యత్వ నమోదు చేసుకొని ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్  అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఏదైనా జరిగితే, హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 50వేల రూపాయల తక్షణ సాయం ప్రతి కార్యకర్త పొందే లాగా ఈ బృహత్తరమైన కార్య క్రమాన్ని తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రారంభించారని అన్నారు.

జనసైనికులు, వీర మహిళల, ప్రజల కోసం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. అందుకోసం పవన్ కళ్యాణ్ తన స్వంత సొమ్ముని కోటి రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించారని వెల్లడించారు. క్రియాశీలక సభ్యులుగా చేరేందుకు మార్చి 7 తుది గడువు అని ఆయన చెప్పారు. జనసేన సభ్యత్వం తీసుకున్న వారికిరూ.5 లక్షల జీవిత బీమా ఉంటుంది. స్వార్ధ రాజకీయాలకు చరమ గీతం పాడేందుకు ప్రజలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఏడో వార్డ్  కౌన్సిలర్ రంగి శెట్టి సుమన్  అన్నారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో బొర్రా అప్పా రావు మాట్లాడుతూ ప్రజలు మార్పును  కోరుకుంటున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి పేద వాడికి జనసేన పార్టీ అండగా వుంటుంది అని అన్నారు.

Related posts

నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి

Satyam NEWS

5 రోజుల పాటు విజయనగరం లో మంత్రి బొత్స…!

Satyam NEWS

31న ‘ఊహలకే ఊపిరొస్తే’ కవితా సంపుటి ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment