హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న వెంగళరావునగర్ డివిజన్, యదగిరినగర్లో రేణుక ఎల్లమ్మ దేవాలయం కోసం ఇరుకైన రోడ్డును ఆక్రమించి అనుమతి లేకుండా నిర్మిస్తున్న ప్రహరీ పిల్లర్లను జీహెచ్ఎంసి అధికారులు శనివారం కూల్చివేశారు. విషయం తెలుసుకున్న నవీన్ యాదవ్,అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు నిలువరించారు.
యదగిరినగర్ లో రౌడి షీటర్ చిన్న శ్రీశైలం యాదవ్ ఉదేశ్య పూర్వకంగా రోడ్డును కబ్జా చేస్తూ రేణుక ఎల్లమ్మ ఆలయం ప్రహరీ పేరిట అక్రమ నిర్మాణాలు చేస్తున్నాడని ఆరోపణ. ఇది అక్రమమని జీహెచ్ఎంసి కూల్చివేతలు చేసింది. ఈ వ్యవహారం రాజకీయం చేస్తూ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారు.
ఈ కూల్చివేతలకు ఎమ్మెల్యే కు సంబంధం లేదు. IPC 151 సెక్షణ్ కింద నవీన్ యాదవ్, ఇతరుల మీద కేసు నమోదు చేసారు. బెయిల్ మీద విడుదలైయారు.