28.7 C
Hyderabad
April 27, 2024 03: 06 AM
Slider మెదక్

మృగాళ్ల వేధింపు భరించలేక ఉరివేసుకుని బాలిక ఆత్మహత్య

#Crime Scene

సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలక లో ఉరి వేసుకొని బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం జరిగింది.

దుబ్బాక ఎస్ఐ మ న్నేస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలిక ఇటీవలే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుంది .ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆ బాలిక పై తప్పుడు ప్రచారం చేస్తూ మానసికంగా వేధించసాగారు.  .

దీనితో జీవితం మీద విరక్తి చెంది తన ఇంటిలో ఎవరూ లేని ఈ సమయంలో ఉదయం 11 గంటలకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి,బాలిక మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం దుబ్బాక సామాజిక ఆస్పత్రికి తరలించారు.

మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులపైకేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై స్వామి తెలిపారు.

Related posts

కాపాడుతున్నది కరోనాను కరోనా రోగులను కాదు

Satyam NEWS

నిరుపేదలకు ఆహార ప్యాకెట్లు అందిస్తున్న బిజెపి నేత

Satyam NEWS

వి ఎస్ యు లో మూల కణాల పై అంతర్జాతీయ వెబినార్

Satyam NEWS

Leave a Comment