సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలక లో ఉరి వేసుకొని బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం జరిగింది.
దుబ్బాక ఎస్ఐ మ న్నేస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలిక ఇటీవలే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుంది .ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆ బాలిక పై తప్పుడు ప్రచారం చేస్తూ మానసికంగా వేధించసాగారు. .
దీనితో జీవితం మీద విరక్తి చెంది తన ఇంటిలో ఎవరూ లేని ఈ సమయంలో ఉదయం 11 గంటలకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి,బాలిక మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం దుబ్బాక సామాజిక ఆస్పత్రికి తరలించారు.
మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులపైకేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై స్వామి తెలిపారు.