40.2 C
Hyderabad
April 28, 2024 18: 07 PM
Slider మహబూబ్ నగర్

పరామర్శించడం కాదు…కూలిన ఇళ్లకు పరిహారం ఇవ్వండి

#dkmadiga

భారీ వర్షాల కారణంగా కూలిపోయిన ఇండ్లకు నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని తెలంగాణ మాదిగ దండోరా జిల్లా అధ్యక్షుడు డి కె మాదిగ కోరారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాత ఇండ్లు కూలిపోతుంటే, అక్కడికి వెళ్లి పరామర్శిస్తున్న నాయకులను చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.

కూలిపోయిన ఇండ్లకు, అక్కడ నివసిస్తున్న, ప్రజలకు కావాల్సింది పరమర్శించడం కాదని ఆయన అన్నారు. ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలకు అయ్యే ఖర్చు కూడా ఇవ్వలేని దుస్థితిలో కొల్లాపూర్ నియోజక వర్గ నాయకులు ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. పెండ్లికి వెళ్లి పోజులు ఇవ్వడం కాదు. కనీసం ఏమైనా చిత్తశుద్ధి ఉంటే,కూలిపోయిన ఇండ్లకు నష్టపరిహారం చెల్లించండి. వాళ్లని ఆదుకోండి అప్పుడు మానవత్వం ఉన్న మనసులు అనిపించుకుంటారు అని డి కె మాదిగ అన్నారు.

Related posts

ఎడ్ల బండ్ల ఇసుక కార్మికులకు ఉపాధి భద్రత కల్పించాలి

Satyam NEWS

ఆత్మస్థైర్యంతో పని చేయండి…అధికారం మళ్ళీ మనదే

Bhavani

దరఖాస్తుదారుల్లో టెన్షన్

Bhavani

Leave a Comment