లక్ష్మీ దేవి అవతారం…. నిజంగా లక్ష్మీదేవి అవతారమే… దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ప్రతి రోజూ ఒక అవతారంలో కొలుస్తారు.
అందులో భాగంగా నేడు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో అమ్మవారికి లక్ష్మీదేవి అవతారం వేశారు. అయితే ఏమనుకున్నారో ఏమో గానీ నిజంగానే డబ్బులతో అలంకరించారు.
మొత్తం 40 లక్షల రూపాయలతో అమ్మవారిని అలంకరించారు. కొల్లాపూర్ వరిదేల షమీ వృక్షం లో నేడు 5 వ రోజు దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి.
అమ్మవారు 40 లక్షల రూపాయల అలంకరణతో లక్ష్మి దేవి అవతారంలో దర్శనం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు భజరంగ్ దళ్ పురెందర్ , కమిటీ సభ్యులు శ్రీ లక్ష్మి, రాజేశ్వరి, శివకృష్ణ, సుగుణమ్మ, , పరమేష్ , బానుప్రకాశ్ , సాయి , భరత్ , మరియు కొల్లాపూర్ పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్