ఇంత కన్నా మంచి వార్త ఈ మధ్య కాలంలో రాలేదు. ప్రపంచ వ్యాప్తంగా వేలాది మరణాలు సంభవిస్తున్న సమయంలో కరోనా వైరస్ సోకిన ఒక యువకుడు పూర్తి ఆరోగ్యంతో బయటకు రావడం అంటే అది కచ్చితంగా మంచి వార్తే. ఇదే కాకినాడలో జరిగింది. ఒక యువకుడు విదేశాల నుంచి రాగానే అతడికి టెస్టు చేస్తే కరోనా పాజిటీవ్ వచ్చింది. దాంతో అతడిని కాకినాడలోని జీసీహెచ్ లో చేర్చారు.
క్వారంటైన్ చేసి చికిత్స ప్రారంభించారు. తర్వాత రెండు మూడు టెస్టుల్లో నెగెటీవ్ రావడంతో అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కరోనా ను జయించిన ఆ వీరుడికి జిల్లా ఉన్నతాధికారులు ఆసుపత్రి వద్దకు వెళ్లి వీడ్కోలు పలికారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సాధారణ జీవితాన్ని గడపాలని ఆశీర్వదించి పంపారు.