కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. బస్టాండ్ ఆవరణలో, గ్రంధాలయం దగ్గర స్థానికులు పడుతున్న ఇబ్బంది గమనించి అక్కడ మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
మున్సిపల్ చైర్మన్ గందె రాధిక, వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల, వార్డు కౌన్సిలర్ రమాదేవి, కమిషనర్ తాళ్లపెల్లి శ్రీనివాస్ టీ ఆర్. ఎస్ నాయకులు గందే శ్రీనివాస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మరుగుదొడ్ల అవసరం ఎంతైనా ఉందని స్థానికులు అంటున్నారు.