ఇన్ని రోజులూ దేశంలోనే ఎక్కడో రహస్యంగా దాక్కొని ఉన్న శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే బుధవారం తెల్లవారుజామున దేశం నుండి పారిపోయాడు. పొరుగున ఉన్న మాల్దీవులకు వెళ్లి ఉంటాడని స్థానిక అధికారులు తెలిపారు.
73 ఏళ్ల గోటబయ రాజపక్సే, అతని భార్య, అంగరక్షకుడు నలుగురు ప్రయాణికులలో ఉన్నారని అధికారులను ఉటంకిస్తూ ఒక ప్రముఖ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపిన ప్రకారం, ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన ఆంటోనోవ్-32 విమానం మాల్దీవులకు చేరిందని తెలిసింది.