మొబైల్ ఫోన్ కాల్ డేటా, ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని భద్ర పరిచే గడువును పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఆ వివరాలన్ని రెండు సంవత్సరాల పాటు భద్రపరిచాలని టెలికం ప్రొవైడర్లకు కేంద్ర టెలికం శాఖ ఆదేశాలు జారీ చేసింది.
సెక్యూరిటీ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పటి వరకు ఏడాది పాటు మాత్రమే మొబైల్ ఫోన్ల కాల్ డేటా, ఇంటర్నెట్ యూసేజీ వివరాలను టెలికం సంస్థలు నిల్వ చేస్తూ వచ్చాయి.
రెండు సంవత్సరాల తర్వాత కూడా టెలికం శాఖ నుంచి ఎటుంవంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో ఆ కాల్ డేటా వివరాలను, ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని తొలగించవచ్చని కేంద్రం పేర్కొంది. దీని ప్రకారం.. టెలికం సంస్థల్లో తమ కస్టమర్ల లాగిన్, లాగౌడ్కు సంబంధించిన వివరాలు రెండు సంవత్సరాలు మాత్రమే భద్రంగా ఉంటాయి.