కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత దేశంలో అడుగు పెట్టడమే కాదు.. రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తుండగా.. మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి..
ఒమిక్రాన్ కట్టడి కోసం కఠిన నిబంధనలను అమలు చేయడానికి రెడీ అయ్యాయి. తాగా ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా, గుజరాత్, ఒడిశా ప్రభుత్వాలు ఒమిక్రాన్ కట్టడికోసం కొన్ని నియమనిబంధనలు ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను అమలు చేస్తుండగా, మరికొన్ని ట్రావెల్ బ్యాన్ లాంటి ఆంక్షలు విధిస్తున్నాయి.