బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశముఖ్ ఆధ్వర్యంలో రైతులకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వ్రాస్తూ ప్రతిని పత్రికలకు విడుదల చేశారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం హుజూర్ నగర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశముఖ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ డి ఓ కార్యాలయం ముందు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా అరుణ్ కుమార్ దేశముఖ్, రాష్ట్ర నాయకుడు ఎం డి అజీజ్ పాషా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లోని రైతాంగం ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు పెట్టుబడులు పెరిగి, దిగుబడి తగ్గి, పండిన కొద్ది పంటను గంపెడు ఆశతో మార్కెట్కు తీసుకొని వెళితే సరియైన గిట్టుబాటు ధర లేకపోవటంతో దిక్కుతోచని స్థితిలో రైతన్నలు ఉన్నారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల దయనీయ పరిస్థితిని అర్థం చేసుకొని పండించిన పంటకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇచ్చి రైతులను తక్షణమే ఆదుకోవాలని హుజూర్ నగర్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జక్కుల మల్లయ్య, పోతుల జ్ఞానయ్య, నరసయ్య, వీరారెడ్డి, రవీందర్ రెడ్డి, దొంతగాని జగన్, సైదా, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు కస్తాల శ్రవణ్ కుమార్, ములకలపల్లి రామ గోపి, పార్టీ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.