పిఎం, సిఎం సహాయ నిధులు గ్రామస్థాయి నిరు పేద ప్రజలకు నేరుగా అందాలంటే ఎన్జీవో (నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ) లను ప్రజా సంఘాలను భాగస్వాములను చేయాలని ఓబీసీ ఐక్యవేదిక అధ్యక్షులు అల్లంపల్లి రామకోటి కోరారు.
కరోనా మహమ్మారి వల్ల ప్రపంచమంతా అతలాకుతలం అవుతూందని, రోజు పని చేస్తేనే పూట గడుస్తుందన్న కోట్లాది మంది నిరు పేద ప్రజల ఆకలి తీర్చడానికి కొందరు మహానుభావులు సీఎం పీఎం సహాయనిధికి కోట్లాది రూపాయలు అందించారని ఆయన అన్నారు.
ఈ నిధులను మాస్కులు, సానీటై జర్స్, బ్లీచింగ్ పొడర్ దుర్వినియోగం కాకుండా నిరు పేద ప్రజలకు గ్రామస్థాయిలో కూడా సంపూర్ణంగా గడప గడపకు ప్రభుత్వ సహాయ నిధులు నేరుగా చేరేందుకు ఎన్జీవో, ప్రజా సంఘాలను భాగస్వాములను చేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు రామకోటి విజ్ఞప్తి చేశారు.