38.2 C
Hyderabad
April 28, 2024 20: 08 PM
Slider ఆదిలాబాద్

అల్లోల దివ్యారెడ్డిని అభినందించిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

allola divyareddy

హైదరాబాద్ లోని  నీలోఫర్‌  ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళైసాయి సౌందరాజన్ పాల్గొన్నారు.

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్, నీలోఫర్‌ హాస్పిటల్, సుషేనా హెల్త్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద‌ర్బంగా క్లిమామ్ వెల్ నెస్ అండ్ ఫార్మ్స్ ద్వారా పిల్లలకు స్వచ్ఛమైన పాలు అందిస్తున్న అల్లోల దివ్యారెడ్డిని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌రరాజ‌న్ అభినందించారు. 

త‌ల్లి పాలు తాగే ద‌శ‌ను దాటిన త‌ర్వాత పిల్లల‌కు స్వ‌చ్చ‌మైన పాల‌ను అందించేందుకు దివ్యారెడ్డి లాంటి వారు కృషి చేస్తున్నార‌ని, వారి సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవాల‌న్నారు. అనంత‌రం అల్లోల దివ్యారెడ్డితో పాటు డాక్టర్ లావణ్య నాయక్ (డిసిపి, సైబరాబాద్) త‌దిత‌రుల‌ను గ‌వ‌ర్న‌ర్ శాలువాతో స‌త్క‌రించారు.

ఈ సంద‌ర్బంగా నీలోఫ‌ర్ హ‌స్పిట‌ల్ లో బాలింత‌ల‌కు దివ్యారెడ్డి డ్రై ఫ్రూట్స్ ను పంపిణీ చేశారు.

Related posts

ఇచ్చిన హామీలను పూర్తి చేస్తూ..ప్రగతి దిశగా ముందుకు..

Satyam NEWS

సీఎం జగన్ రాజీనామా చేయాలి

Satyam NEWS

ఎస్వీబీసీ ఛానల్ పై సమీక్ష

Murali Krishna

Leave a Comment