రాష్ట్ర గవర్నర్ తమిళ్లిసై భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ని దర్సించుకున్నారు. గవర్నర్ కు పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు, ఆధికారులు స్వాగతం పలికారు.
గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం
శ్రీ లక్ష్మి తాయారు అమ్మవారి ఆలయంలో వేద పండితులు వేద ఆశీర్వచనం,స్వామి వారి జ్ఞాపిక లడ్డు ప్రసాదంను అందచేసారు . శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం అనంతరం స్వామి వారి దర్శనానికి విచ్చేసి క్యు లైన్ లో ఉన్న భక్తులను పలకరించిన గవర్నర్ వారి తో మాట్లాడారు.
దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఇక్కడ నివసించే ఆదివాసీల బాగోగులు తెలుసుకోవడానికి ఈరోజు ఆదివాసీల నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివాసీలతో తెలంగాణ గవర్నర్ తమిళ సై ఆదివాసీలతో ముఖాముఖీ కార్యక్రమంలో కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే పోదేం వీరయ్య, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఐటిడిఎ ఎపిఓ జనరల్ డేవిడ్ రాజ్, ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు, ప్రజలు.